అవనిగడ్డ డిపోలో బస్సులు నిలిపివేత

AP: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెచ్చిన ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల RTC సిబ్బంది, మహిళా ప్రయాణికుల మధ్య వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మహిళా ప్రయాణికులు తమపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు దిగుతున్నారని కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బస్సు సర్వీసులను నిలిపివేశారు. డిపో గేటు వద్దే నిరసనకు దిగడంతో వందలాది మంది ప్రయాణికులు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు బస్టాండ్లోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై కొందరు మహిళలు దాడులు చేస్తున్నారని, తమకు కనీస రక్షణ కరువైందని వాపోయారు.



