← Back to news

చిన్నారి మిస్సింగ్ కేసు.. వీడిన కుక్క మృతి మిస్టరీ

By DK· 26 Jun 2026· కాకినాడ జిల్లా
చిన్నారి మిస్సింగ్ కేసు.. వీడిన కుక్క మృతి మిస్టరీ

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా భావించిన వారి పెంపుడు కుక్క మృతిపై సస్పెన్స్ వీడింది. పెంపుడు కుక్క ఎలాంటి విష ప్రయోగానికి గురికాలేదని, అది కేవలం అనారోగ్యంతోనే మరణించిందని ఫోరెన్సిక్ నివేదికలో నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసులో కుక్కను ఎవరైనా కావాలనే చంపేసి ఉంటారనే కోణంలో సాగిన అనుమానాలకు బ్రేక్ పడింది. మిస్సైన చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.

More in AP