← Back to news

కిడ్నాప్ చేసి.. తలకిందులుగా వేలాడదీసి దాడి

By DK· 27 Jun 2026· ఏలూరు జిల్లా
కిడ్నాప్ చేసి.. తలకిందులుగా వేలాడదీసి దాడి

AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ పోలవరం గ్రామానికి చెందిన తమ్మిలేటి అంజిబాబు అనే వ్యక్తి అదే గ్రామంలో పందెంకోడి పుంజులను దొంగిలించాడనే నెపంతో కొంతమంది యువకులు దాడిచేశారు. అంజిబాబును కిడ్నాప్ తరహాలో కొంతమంది వ్యక్తులు కారులో తీసుకువెళ్లి తలకిందులుగా వేలాడతీసి కొట్టినట్లు సమాచారం. బాధితుడు చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని గ్రామస్తులు రోడ్డెక్కారు. కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం చేస్తూ దాడిచేసిన వారికే కొమ్ము కాస్తున్నారని PS ఎదుట గ్రామస్తులు ధర్నా చేశారు.

More in AP