Crime· 6 Aug 2026
ఒక్క నిర్లక్ష్యం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
AP: కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండలం తోలగంగనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప నుంచి కూరగాయలు, ప్రయాణికులతో కమలాపురం వైపు వెళ్తున్న ఆటో రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఢీకొన్న తీవ్రతకు ఆటో ముందు భాగం దెబ్బతినగా, కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. గాయపడిన ఇద్దరికి స్థానికులు, 108 అంబులెన్స్ సిబ్బంది కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.