Crime· 4 Aug 2026
ఫ్రెండ్షిప్ డే విషాదం.. ఇంకా దొరకని ఇద్దరు
AP: విశాఖపట్నం పాతగంగవరం బీచ్లో ఫ్రెండ్షిప్ డే రోజున అలల్లో <a href="https://www.theclearcutnews.com/n/hVd9MDU">గల్లంతైన</a> యువతి నీతూ, యువకుడు దామోదర్ కోసం మూడో రోజూ గాలింపు కొనసాగుతోంది. నేవీ, బీచ్ లైఫ్గార్డ్స్, హెలికాప్టర్లతో విస్తృతంగా వెతుకుతున్నప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. భారీ అలలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం ఏడుగురు స్నేహితులు బీచ్కు వెళ్లగా, రాయిపై ఫోటోలు దిగుతున్న సమయంలో భారీ అల తాకి నీతూ సముద్రంలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన దామోదర్ కూడా గల్లంతయ్యాడు.