Crime

హెల్త్ సెంటర్‌లో రోగులు వెయిటింగ్.. సిబ్బంది స్లీపింగ్
Crime· 7 Aug 2026

హెల్త్ సెంటర్‌లో రోగులు వెయిటింగ్.. సిబ్బంది స్లీపింగ్

TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ప్రభుత్వ CHCలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరు ఉద్యోగులు విధులు నిర్వహించకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు కార్యాలయంలోనే నిద్రపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యసేవల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశాకార్యకర్తలు కూడా గ్రామాల్లో సమయపాలన పాటించడం లేదని వాపోతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.