మనీ లాండరింగ్ కేసు పేరుతో భారీ మోసం

AP: ఈడీ అధికారులం, మేము ఢిల్లీ పోలీసులం అంటూ సైబర్నేరగాళ్లు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వృద్ధురాలు అలవేలు మంగమ్మను మోసం చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని, ఆస్తులు సీజ్ చేస్తామని బెదిరించి వీడియో కాల్స్తో నమ్మించారు. కేసు నుంచి తప్పించాలంటే డబ్బు చెల్లించాలని చెప్పడంతో ఆమె రూ.1.43 కోట్లు RTGS ద్వారా వారి ఖాతాలకు బదిలీ చేశారు. మరో రూ.95 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అమెరికాలో ఉన్న తన కుమారుడికి విషయం చెప్పింది. అతడి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించింది.



