Education

ప్రిన్సిపల్ మాకొద్దు.. రోడ్డెక్కిన స్టూడెంట్స్
Education· 4 Aug 2026

ప్రిన్సిపల్ మాకొద్దు.. రోడ్డెక్కిన స్టూడెంట్స్

TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాలలో కనీస వసతులు కల్పించాలని, ప్రిన్సిపల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జహీరాబాద్–పొట్పల్లి రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టగా గ్రామసర్పంచ్, స్థానికులు వారికి మద్దతు తెలిపారు. కళాశాలలో వసతుల లేమితోపాటు ప్రిన్సిపల్ వేధింపులు ఎక్కువయ్యాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ బదిలీపై హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

నీళ్లు తాగిన స్టూడెంట్స్‌కు అస్వస్థత.. స్కూల్‌లో టెన్షన్
Education· 2 Aug 2026

నీళ్లు తాగిన స్టూడెంట్స్‌కు అస్వస్థత.. స్కూల్‌లో టెన్షన్

AP: అన్నమయ్య జిల్లా KV పల్లి మండలం చిన్నకంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు తాగిన అనంతరం ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కలకలం రేపింది. వాంతులు, అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఉపాధ్యాయులు వెంటనే వారిని మహల్ క్రాస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. తాగునీటిలో గుర్తుతెలియని విషపదార్థం కలిసిందనే అనుమానంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపేందుకు చర్యలు చేపట్టారు.