Jobs

ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం
Jobs· 19 Jul 2026

ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం

తెలంగాణలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగులకు నియామక పత్రాలు అందిస్తామని CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ‘అందెశ్రీ స్మృతివనం’కు భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. BRS ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దాదాపు 70వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందించిందన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు.

యువ సంగ్రామ సభను సక్సెస్ చేయాలి
Jobs· 16 Jul 2026

యువ సంగ్రామ సభను సక్సెస్ చేయాలి

TG: నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జూలై 18వ తేదీన BRS పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగ సమస్యలను విస్మరించిందన్నారు. నిరుద్యోగ యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించేలా యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జెన్ జీ టెకీలలో జాబ్స్ పై తగ్గుతున్న ఆసక్తి !
Jobs· 9 Jul 2026

జెన్ జీ టెకీలలో జాబ్స్ పై తగ్గుతున్న ఆసక్తి !

కార్పొరేట్ ఇండియాలో ఉద్యోగుల పని తీరుకు సంబంధించి 'ఎఫర్ట్ రిసెషన్' అనే కొత్త ట్రెండ్ మొదలైంది.'గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా' తాజా నివేదిక ప్రకారం దాదాపు 63 శాతం ఇండియన్ కంపెనీల ఉద్యోగులు తమ జాబ్ పరిధి దాటి అడుగు ముందుకు వేయడం లేదు.ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఈ మార్పు స్పష్టం గా కనిపిస్తోంది. 2023 నుండి వర్క్‌ఫోర్స్‌లో జెన్ జీ ఉద్యోగుల సంఖ్య 13% నుండి 26%కి రెట్టింపు అయింది. ఈ తరం యువత జాబ్ సేఫ్టీ కంటే ఫ్లెక్సి బిలిటీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తు న్నారు.ఏఐ వాడకం పెరగడం వల్ల వర్క్ ప్రెషర్, డెడ్ లైన్లు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు.

'సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి'
Jobs· 16 Jun 2026

'సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి'

TG: వివిధ నేషనల్ ఎగ్జామ్స్, ఉద్యోగ పరీక్షలు ఉన్న తేదీల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు, అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారని, రెండు పరీక్షలు ఒకేరోజు ఎలా రాస్తారని వర్సిటీ అధికారులను స్టూడింట్స్ ప్రశ్నిస్తున్నారు. OU న్యాయశాస్త్ర విభాగానికి చెందిన 3, 4, 5, 6వ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ ఈ నెల 18 నుంచి మొదలు కానున్నాయి. జూన్ 21వ తేదీన UGC నెట్ పరీక్షతో పాటు, సివిల్ జడ్జ్ మెయిన్స్, హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నాయి. ఆయా పరీక్షలు జిల్లా కేంద్రాల్లో ఉండగా.. అక్కడ ఆ పరీక్షలు రాసి, మళ్ళీ హైదరాబాద్‌కు ఎప్పుడు చేరుకొని సెమిస్టర్ పరీక్షలు రాస్తారని పైరయ్యారు.