Local

కాల్పుల ఘటనపై భువనగిరిలో కాంగ్రెస్ ఆందోళన
Local· 26 Aug 2026

కాల్పుల ఘటనపై భువనగిరిలో కాంగ్రెస్ ఆందోళన

TG: ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై కాల్పులు జరిపిన ఘటనను ఖండిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లాలో భువనగిరిలో నిరసన నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంగ ప్రవీణ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై కాల్పులు జరపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలన్నారు.