హెచ్ఐవీ నివారణకు బాధ్యతగా ముందుకు రావాలి

TG: హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని ఐసీటీసీ కౌన్సిలర్ ఎం. హనుమంతరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ‘ఐఈసీ క్యాంపెయిన్–2026’ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. హెచ్ఐవీపై ప్రజల్లో అవగాహన పెంచడం, అపోహలను తొలగించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు.



