జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి

TG: కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని SFI, AISA డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. కళాశాలలో 8 కోర్సుల్లో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నప్పటికీ వారి సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవన్నారు. దీంతో చెట్ల కింద, తరగతి గదుల బయట కూర్చుని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.



