మల్లన్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ఆగ్రహం

TG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి సరికాదని మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రఘునాథ రాజు విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆలేరులో బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై మల్లన్న పోటీకి సిద్ధపడటం సమంజసం కాదన్నారు. సొంత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిపైనే పోటీ చేయడం ద్వారా బీసీల మధ్య ఐక్యతను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.


