Local· 20 Aug 2026
మాకవరపాలెంలో అవగాహన ర్యాలీ
AP: అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఆరోగ్యశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సిబ్బంది ర్యాలీ చేపట్టి ప్రజలకు దోమల వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై వివరించారు. వైద్యాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.