← Back to news

కపటిలో పశువులకు వైద్యం కరువు.. రైతుల ఆవేదన

By kishore.m swamy· 20 Aug 2026· Kapati, Adoni, Kurnool
కపటిలో పశువులకు వైద్యం కరువు.. రైతుల ఆవేదన

AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో పశువులకు అత్యవసర వైద్యం అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అవసరమైన మందులు, వైద్య పరికరాలు లేవని చెప్పి పశువులను ఆదోని పశు వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో పశువులను దూరంగా తరలించాల్సి రావడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం ఆలస్యం కావడంతో పశువుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు.

More in Local