చెవుటూరు రోడ్డుపై వాహనదారుల అవస్థలు
AP: NTR జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామ ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై భారీ గుంతలు ఏర్పడి, ఇటీవల కురుస్తున్న వర్షాలకు అవి నీటితో నిండిపోయాయి. గుంతల లోతు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి జారిపడుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల బస్సులు, అంబులెన్సులు సైతం ఈ మార్గంలో నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది.



