← Back to news

మాంసం వ్యర్థాలతో ప్రజారోగ్యంపై ఆందోళన

By sp sp· 20 Aug 2026
మాంసం వ్యర్థాలతో ప్రజారోగ్యంపై ఆందోళన

TG: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో మాంసం వ్యర్థాల సమస్య స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉప్పల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రైవేట్ కంటైనర్‌లో మాంసం వ్యర్థాలను నిల్వ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వ్యర్థాలు కుళ్లిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోందని, అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More in Local