← Back to news

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే శంకర్

By Adithya D· 20 Aug 2026
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే శంకర్

TG: రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగానికి కొత్త దిశ చూపిన నాయకుడని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని రాజీవ్ కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో సాంకేతికతకు ప్రాధాన్యం పెంచి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని పేర్కొన్నారు.

More in Local