← Back to news

ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం.. 10 మందికి గాయాలు

By Sateesh· 20 Aug 2026· Yendada, Visakhapatnam (Rural), Visakhapatnam

AP: విశాఖపట్నంలో విధులకు వెళ్తున్న పోలీస్ సిబ్బంది వాహనం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం జూ పార్క్ సమీపంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఏఆర్ విభాగానికి చెందిన సుమారు 10 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి పోలీస్ సిబ్బంది, స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More in Local