నూతనకల్లో రాజీవ్ గాంధీ జయంతి!

TG : నూతనకల్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మండల అధ్యక్షులు కట్టా మల్లారెడ్డి ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, మన దేశానికి కంప్యూటర్ సాంకేతికతను పరిచయం చేసి, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. నవభారత నిర్మాణం కోసం చేసిన ఆయన సేవలను ఎప్పటికీ మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




