Viral

పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు!
Viral· 20 Jun 2026

పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు!

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా గంహారియా గ్రామంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు అస్సలు పడకపోవడంతో ఊరి పెద్దలు ఒక వింత పాత సంప్రదాయాన్ని మళ్లీ ఫాలో అయ్యారు. ఊరిలో వర్షాలు పడాలంటే ‘అందిర బిబాహ’ (మగాళ్ల పెళ్లి) చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా జతిన్ (29), కలాండి (27) అనే ఇద్దరు మగాళ్లకు గుడిలో గ్రాండ్‌గా పెళ్లి చేశారు. సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక రోజంతా భార్యాభర్తలుగా కలిసి ఉండి, ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఇలా చేస్తే వర్షాలు పడతాయని గ్రామస్తుల గట్టి నమ్మకం. ప్రస్తుతం ఈ వింత పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

కుంభమేళా గర్ల్ మోనాలిసాకు ప్రాణభయం..
Viral· 20 Jun 2026

కుంభమేళా గర్ల్ మోనాలిసాకు ప్రాణభయం..

'కుంభమేళా గర్ల్' మోనాలిసా, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్‌కు ప్రొటెక్షన్ ఇవ్వాలని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆన్‌లైన్ లవ్‌తో వీరిద్దరూ కేరళలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా, మోనాలిసా మైనర్ అంటూ ఆమె తండ్రి మధ్యప్రదేశ్‌లో కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో భర్త అరెస్ట్‌పై కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. మతాంతర వివాహం వల్ల తమ ఫ్యామిలీస్ నుండి ప్రాణాలకు ముప్పు ఉందని ఈ కపుల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, జులై 10న జరిగే నెక్స్ట్ హియరింగ్ వరకు వీరికి సేఫ్టీ కల్పించాలని కోర్టు ఆర్డర్ వేసింది.

ధర్మస్థల్ 200 కోట్ల డీల్‌ పై.. ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్!
Viral· 18 Jun 2026

ధర్మస్థల్ 200 కోట్ల డీల్‌ పై.. ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్!

ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన రూ.200 కోట్ల డీల్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా భాగస్వామ్యం ఉందంటూ మాజీ కార్మికుడు చిన్నయ్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై బెంగళూరులో ప్రెస్‌మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే తనకు చిన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని, అతడితో ఒకేసారి ఫోన్ మాట్లాడినట్లు, ఆ జరిగిన ఫోన్ సంభాషణల రికార్డింగ్‌లను కూడా తానే సిట్ (SIT) అధికారులకు పంపానని స్పష్టం చేశారు. గతం లో ఆలయ ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్యను తానే కోరినట్లు ప్రకాష్ రాజ్ ప్రెస్‌మీట్‌లో వివరణ ఇచ్చారు.

దేవుడి కోసం వింత పూజ!
Viral· 13 Jun 2026

దేవుడి కోసం వింత పూజ!

మహాదేవుడిని చూడాలనే నమ్మకంతో దౌలత్ జీరి జీ మహారాజ్ అనే వ్యక్తి చదువు ఆపేసి, అస్సలు కూర్చోకుండా కేవలం నిలబడే ఉండాలని డిసైడ్ అయ్యాడు. నిద్రపోయేటప్పుడు కూడా తాడు సాయంతో నిలబడే ఉంటాడట. ఇలా ఐదేళ్లుగా ఉండటం వల్ల కాళ్లకు బ్లడ్ పూల్ అయిపోయి, అవి చెట్టు కాండంలా లావుగా వాచిపోయాయి. హెల్త్ కండిషన్ చాలా డేంజర్‌గా ఉన్నా. తను అనుకున్న 12 ఏళ్ల టార్గెట్ పూర్తి చేయడమే లక్ష్యంగా ఇప్పుడూ అలాగే నిలబడి ఉన్నాడట. వాలంటీర్లు వాటిని క్లీన్ చేస్తూ మందులు రాస్తున్నారు. అయినా సరే ఆయన ఇప్పటివరకు ఆ దేవుణ్ణి చూడలేకపోయారని ఇంటర్నెట్‌లో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.