Latest

PM ఫుడ్ సెక్యూరిటీ సీక్రెట్స్..
Politics· 8 Aug 2026

PM ఫుడ్ సెక్యూరిటీ సీక్రెట్స్..

ప్రధాని మోదీ తినే ఆహారం వెనుక ఉండే ఫుడ్ సెక్యూరిటీ ఎంత టైట్‌గా ఉంటుందో తెలుసా? ఆయన సెక్యూరిటీ బాధ్యతలను కమాండెంట్ ఆఫీసర్ ఎం. రామకృష్ణ అండ్ టీమ్ పర్యవేక్షిస్తారు. మార్కెట్‌లో ఫ్రెష్ వెజిటబుల్స్ కొనడం దగ్గర్నుంచి కుకింగ్ పూర్తయ్యే వరకు ప్రతీదీ వీళ్ల కళ్లముందే జరుగుతుంది. ప్రధాని తినడానికి కంటే ముందే రామకృష్ణ తన టీమ్‌తో కలిసి ఆ ఫుడ్‌ని స్వయంగా టేస్ట్ చేసి క్వాలిటీ చెక్ చేస్తారు. ప్రధాని రక్షణ కోసం వీళ్లు తీసుకునే కేర్ ఇలా ఉంటుంది. ఇంకా డీటైల్ గా తెల్సుకోవలంటే <a href="https://x.com/tathvamasi6/status/2085984525012660650?s=20">లింక్(రెడ్ కలర్)</a> క్లిక్ చేయండి.

మహిళ అస్థిపంజరం..మరణించి రెండేళ్లు?
India· 8 Aug 2026

మహిళ అస్థిపంజరం..మరణించి రెండేళ్లు?

బెంగళూరులోని ఓ ఇంట్లో దక్షాయిని(57) అనే మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కుమారుడు 2005లో మరణించాడు. దీంతో ఆమెకు స్కిజోఫ్రేనియా వచ్చింది. 2017లో భర్త మరణించాక ఆమె ఒంటరిగా ఉంటోంది. రెండేళ్లుగా ఎవరితోనూ ఆమెకు సంబంధాలు లేవు. ఆమె సోదరుడు మహేష్ బసప్ప పోలీసులకు చెప్పడంతో వాళ్లు వచ్చి శవాన్ని గుర్తించారు. ఆమె మరణించి రెండేళ్లయ్యిందా అని అనుమానిస్తున్నారు.

రోడ్డుపై భారీ గుంత.. ల్యాడర్‌తో కిందకు దిగిన పార్టీ లీడర్!
Politics· 8 Aug 2026

రోడ్డుపై భారీ గుంత.. ల్యాడర్‌తో కిందకు దిగిన పార్టీ లీడర్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని కమలానగర్‌లో రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ టైమ్‌లో వెహికల్స్ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా, అధికారులు అక్కడికొచ్చి వాహనాల రాకపోకలను ఆపేశారు. సమాజ్‌వాదీ పార్టీ లీడర్ నితిన్ కోహ్లీ అక్కడికి చేరుకున్నారు. నిచ్చెనతో గుంతలోకి దిగిన ఆయన.. ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు చేశారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పనుల్లో కరప్షన్ కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు.

UPI ఛార్జీల రూమర్స్‌కి చెక్
News· 8 Aug 2026

UPI ఛార్జీల రూమర్స్‌కి చెక్

UPI పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు పడవని PhonePe CEO <a href="https://x.com/_sameernigam/status/2085983802778583313?s=20">సమీర్ నిగమ్</a> క్లారిటీ ఇచ్చారు. "ఇండియన్ యూజర్లకు UPI ఎప్పటికీ పూర్తి ఫ్రీగా అందుతుంది. యూజర్లు చేసే పేమెంట్స్‌కి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు" అని ఆయన ఎక్స్ (Twitter) పోస్ట్‌లో క్లియర్‌గా చెప్పారు. రీసెంట్‌గా ఛార్జీలపై వస్తున్న రూమర్స్‌కి ఈ ట్వీట్‌తో ఫుల్ స్టాప్ పడింది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎప్పటిలాగే ఫ్రీగా UPI వాడుకోవచ్చు.

ట్రాఫిక్‌కు టాటా.. గాల్లో దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వెహికల్!
Technology· 8 Aug 2026

ట్రాఫిక్‌కు టాటా.. గాల్లో దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వెహికల్!

దేశంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా ఉత్తరాఖండ్‌ యువకుడు రవి తమ్తా సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్‌ను డిజైన్ చేశాడు. అల్మోరా జిల్లా కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి.. ‘హపిదా స్కైనెక్స్’ పేరుతో సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్‌ను డెవలప్ చేశాడు. అల్మోరా గ్రౌండ్‌లో దీన్ని సక్సెస్ఫుల్‌గా టెస్ట్ చేశాడు. పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచే ఈ వెహికల్ గ్రీన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. రవి స్థాపించిన హపిదా స్కై ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్‌ ద్వారా దీనిని డెవలప్ చేశారు.

డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్?
News· 8 Aug 2026

డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్?

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వచ్చే డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వీటిపై యాక్షన్ తీసుకోవాలని మెటా కంపెనీని ఆర్డర్ చేసింది. సోషల్ మీడియాలో ఉండే కంటెంట్‌కు ఆయా కంపెనీలే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని క్లియర్‌గా చెప్పింది. మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో రీసెంట్‌గా జరిగిన మీటింగ్‌లో ఆరా తీశారు. గవర్నమెంట్ అడిగిన క్వశ్చన్స్‌కి రెస్పాండ్ అయిన మెటా, డీప్‌ఫేక్స్ ఆపడానికి తమ దగ్గర ప్రాపర్ సొల్యూషన్స్ ఉన్నాయని తెలిపింది.

అవమానంతో సూసైడ్ చేసుకున్న శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్
Crime· 8 Aug 2026

అవమానంతో సూసైడ్ చేసుకున్న శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్

AP: కాకినాడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో ఫీజ్ కట్టలేదని అవమానించడంతో ఇంటర్ ఫస్టియర్ (15 ఇయర్స్) స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఫీజ్ కట్టలేదని క్లాస్‌రూమ్‌లో అందరి ముందు స్టాఫ్ నిలదీసి ఇంటికి పంపారు. ఇది చూసిన తోటి స్టూడెంట్స్ నవ్వడంతో అవమానంగా భావించి ఆ స్టూడెంట్ నిన్న రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాఫ్ వేధింపుల వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆరోపిస్తూ పేరెంట్స్, బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజ్‌పై దాడి చేయడానికి ప్రయత్నించారు.

టెక్నాలజీ వరమా.. ప్రైవసీకి శాపమా?
Infotainment· 8 Aug 2026

టెక్నాలజీ వరమా.. ప్రైవసీకి శాపమా?

మెటా విడుదల చేసిన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అమ్ముడవుతూ పాపులర్ అవుతున్నాయి. వీటి ద్వారా ఎదుటివారికి తెలియకుండా సీక్రెట్‌గా వీడియోలు తీసే ఛాన్స్ ఉందేమోనని ప్రజలు భయపడుతున్నారు. చూపు లోపం ఉన్నవారికి, రోజువారీ పనులకు ఇవి బాగా హెల్ప్ అవుతున్నాయని యూజర్లు అంటుంటే, ఇతరుల ప్రైవసీని దెబ్బతీసేలా మారుతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ టెక్నాలజీ వరమా లేక ప్రైవసీకి శాపమా అని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వరుణ్ తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్..
Cinema· 8 Aug 2026

వరుణ్ తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్..

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కొత్త హారర్-కామిడీ సినిమా 'కోరియన్ కనకరాజు' బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ప్రీమియర్లతో కలిపి ఫస్ట్ డేనే వరల్డ్‌వైడ్‌గా రూ.10.2 కోట్లకు పైగా మొత్తం కలెక్షన్స్ సాధించి, వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. హారర్‌తో పాటు మంచి కామెడీ ఉండటంతో ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్లలో జనాలు బాగానే వస్తుండటంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇక నార్త్ అమెరికాలో కూడా ఆల్రెడీ $175K కంటే ఎక్కువ కలెక్ట్ చేసి మంచి రన్ సాధిస్తోంది.

లాంగ్ వీకెండ్ లేకున్నా తగ్గేదేలే..
Infotainment· 8 Aug 2026

లాంగ్ వీకెండ్ లేకున్నా తగ్గేదేలే..

ఈసారి 'Independence Day' శనివారం రావడంతో పెద్దగా లాంగ్ వీకెండ్ లేకపోయినా టూరిస్టులేమీ నిరాశపడటం లేదు. విమానాల్లో దూర ప్రాంతాలకు వెళ్లేకంటే, సొంత వాహనాల్లోనే 2 నుండి 5 గంటల దూరంలో ఉన్న రిసార్ట్స్, రోడ్ ట్రిప్స్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముంబై వాసులు లోనావాలా, బెంగళూరు జనాలు కూర్గ్, అలాగే ఊటీ, కొచ్చి వైపు క్యూ కడుతున్నారు. దీంతో విల్లాలు, హోటళ్ల బుకింగ్స్ 30 శాతం వరకు పెరిగాయి.

25 మంది Bangladeshisను పంపించానంటూ పోలీసులకు సవాల్!
Crime· 8 Aug 2026

25 మంది Bangladeshisను పంపించానంటూ పోలీసులకు సవాల్!

బెంగళూరుకు 25 మంది బంగ్లాదేశీయులను పంపించానని, వారిని పోలీసులు పట్టుకోలేరంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన వీడియో కలకలం రేపింది. వారు పోలీసులు, రాజకీయ నాయకుల ఇంటికి వచ్చి వారి ఫ్యామిలీకి హాని చేస్తారని బెదిరించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేస్ బుక్ చేసి దర్యాప్తు చేసారు. ఆ వ్యక్తి మండ్య జిల్లా కృష్ణరాజపేట చెందిన సంతోష్ కుమార్‌గా గుర్తించారు. దుబాయ్‌లో హోటల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తరువాత వీడియోను డిలీట్ చేసి, పోలీసులకు సారీ చెబుతూ మరో వీడియోను పోస్ట్ చేశాడు.

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు
TG· 8 Aug 2026

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లోని నేషనల్ హైవేపై RTC ఎలక్ట్రిక్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 20మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, RTC అధికారులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా, ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Art + Fashion
Infotainment· 8 Aug 2026

Art + Fashion

ఫ్యాషన్ ప్రపంచంలో కళ (Art) సరికొత్తగా మారుతుంది. డిజైనర్లు, లగ్జరీ బ్రాండ్ల పెయింటింగ్స్, శిల్పకళను డ్రెస్సులు, యాక్సెసరీలలో కలిపి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు. డాలీ ఆర్ట్‌ను పోలిన పెదవుల బ్రోచ్, తరుణ్ తహిలియాని 'పిచ్వాయ్ ఆర్ట్' జంప్‌సూట్, అనామికా ఖన్నా 'పటాచిత్ర' కోట్లతో పాటు డోల్చే అండ్ గబ్బానా టీషర్ట్‌లు డిజైనర్ వేర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. లూయిస్ విటన్ బ్యాగులు, వెరైటీ డిజైన్ వాచీలు, సన్‌గ్లాసెస్ వింటేజ్ అండ్ మోడ్రన్ లుక్ ఇస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

₹500 నోటుపై అంబేద్కర్ ఫొటో?
India· 8 Aug 2026

₹500 నోటుపై అంబేద్కర్ ఫొటో?

భారత కరెన్సీపై మహాత్మా గాంధీతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫొటో కూడా ఉండాలా..?💵 తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ప్రతిపాదన చేశారు. దేశ రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ చేసిన సేవలకు గౌరవ సూచకంగా భారత కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. కాబట్టి ఇప్పటివరకు భారత కరెన్సీ డిజైన్‌లో ఎలాంటి మార్పు జరగలేదు.

బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత ఓపెన్ ఛాలెంజ్
Politics· 8 Aug 2026

బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత ఓపెన్ ఛాలెంజ్

TG: కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేంద్ర నిధులుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రూ.210 కోట్లు ఇస్తే రూ.840 కోట్లు తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని పేర్కొన్నారు. నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, బండి సంజయ్ సిద్ధమా అని సవాల్ చేశారు.

మెడికో ప్రియాంక ఆరోగ్యంపై హైటెన్షన్
AP· 8 Aug 2026

మెడికో ప్రియాంక ఆరోగ్యంపై హైటెన్షన్

AP: రాజమండ్రి <a href="https://www.theclearcutnews.com/n/NtiWpLS">ఘటన</a>లో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ప్రియాంకకు అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు డాక్టర్స్ ప్రయత్నించినప్పటికీ, శరీరం సహకరించకపోవడంతో పరీక్షను నిలిపివేశారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులతో వైద్యులు చర్చించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలో తోటి విద్యార్థితో బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

పెద్ది కుటుంబానికి KCR భరోసా
Politics· 8 Aug 2026

పెద్ది కుటుంబానికి KCR భరోసా

TG: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి BRS అధినేత KCR అండగా నిలిచారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. వృద్ధాప్యంలో ఉన్న సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం ఆమె పేరుపై మరో రూ.25 లక్షలను బ్యాంకులో జమ చేయాలని తెలిపారు. మొత్తంగా కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. పిల్లల చదువు, భవిష్యత్‌తో పాటు కుటుంబ సంక్షేమానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

వర్షాల కోసం ఈ నెల 10న CM వరుణ యాగం
Politics· 8 Aug 2026

వర్షాల కోసం ఈ నెల 10న CM వరుణ యాగం

TG: రాష్ట్రంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ నెల 10న నాగార్జునసాగర్‌లో ప్రభుత్వం వరుణ యాగం చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగం చేయనున్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో ఈ యాగం జరగనుంది. తరువాత పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

GenZలపై మాట మార్చిన కంగనా రనౌత్
India· 8 Aug 2026

GenZలపై మాట మార్చిన కంగనా రనౌత్

మోహన్ భాగవత్ GenZలతో మాట్లాడిన తర్వాత బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ GenZలపై తన వైఖరి మార్చుకున్నారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో వాళ్లను పొగిడారు. వాళ్లు మన దేశానికి బలం అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ద్వారా యువత ప్రభావితమవుతున్నారని చెప్పారు. దేశ యువత మన సంస్కృతికి అంబాసిడర్‌లుగా మారుతున్నారన్నారు. అయితే అల్లరి చేసే కొంతమంది వల్ల మొత్తం తరం పేరు పాడవుతోందని చెప్పారు. ఇటీవల GenZలపై విరుచుకుపడ్డ ఆమె ఇప్పుడు మాట మార్చడం చర్చగా మారింది.

మన్యం బంద్‌తో ఏజెన్సీలో టెన్షన్
AP· 8 Aug 2026

మన్యం బంద్‌తో ఏజెన్సీలో టెన్షన్

AP: అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఆదివాసీ సంఘాలు చేపట్టిన మన్యం బంద్ కొనసాగుతోంది. జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించడంతోపాటు స్థానిక గిరిజనులకు 100శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. 1/70 చట్టాన్ని పక్కాగా అమలుచేసి, భూబదలాయింపులను అడ్డుకోవాలని కోరారు. పాడేరులో ఆదివాసీ సంఘాల నేతలు RTC కాంప్లెక్స్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి బస్సులు, వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. రంపచోడవరం సహా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి.

భయపెట్టే పుర్రె.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్!
Infotainment· 8 Aug 2026

భయపెట్టే పుర్రె.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్!

ఒకప్పుడు చావుకు, భయానికి గుర్తుగా చూసే 'పుర్రె' (Skull💀) సింబల్, ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక క్రేజీ ట్రెండ్‌గా మారిపోయింది. మొదట్లో బైకర్స్, రాక్ స్టార్ల నుంచి వచ్చిన ఈ స్టైల్, తర్వాత హార్లే డేవిడ్సన్ లోగోలు, అలెగ్జాండర్ మెక్‌క్వీన్ డిజైన్లతో లగ్జరీ ఫ్యాషన్ ఐకాన్‌గా ఎదిగింది. ఉంగరాలు, టీషర్టులు, డ్రెస్సుల నుంచి సోషల్ మీడియా ఎమోజీల వరకు ఈ పుర్రె గుర్తు కూల్ అండ్ మోడ్రన్ స్టైల్ సింబల్‌గా యూత్‌ను ఆకట్టుకుంటుంది.