Latest

తిరువణ్ణామలైలో నేటి నుంచి కొత్త రూల్..ఫోన్లకు NO
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. తమిళనాడు హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్(HR&CE) శాఖ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు, రీల్స్ తీయడాన్ని నిషేధించారు. ఆలయంలో ఇక ఎవరూ ఫోన్లు వాడకూడదు. భక్తుల కోసం ఆలయం దగ్గర ఐదు మొబైల్ డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లను ఈ కేంద్రాల్లో ₹5 చెల్లించి డిపాజిట్ చేసి టోకెన్ తీసుకోవచ్చు. దర్శనం తర్వాత టోకెన్తో ఫోన్ను తిరిగి తీసుకోవచ్చు.

బాధిత నర్సు కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చౌటుగూడెం గ్రామానికి చెందిన నర్సు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో హత్యకు గురైన ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు జీవనోపాధి కోసం భూమి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే కొంత ఆర్థికసాయం అందించామని తెలిపారు.

IAS దివ్యా మిట్టల్ రాజీనామా
2013 బ్యాచ్ IAS అధికారి దివ్యా మిట్టల్ 13 ఏళ్ల సర్వీస్ తర్వాత రాజీనామా చేశారు. మిర్జాపూర్లో 75 ఏళ్లుగా తాగునీరు లేని లహురియాదహ్ గ్రామానికి పైప్లైన్ ద్వారా నీరు అందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయడం ద్వారా ఆమె గుర్తింపు పొందారు. తన రాజీనామాకు ప్రభుత్వం ఒత్తిడి లేదా ఏదైనా సంఘటన వల్ల తీసుకున్న నిర్ణయం కాదని ఆమె తెలిపారు. కుటుంబం, పర్సనల్ ప్రిఫరెన్స్, తనకు ఇంట్రెస్ట్ ఉన్న ఇతర విషయాల గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు.

గోల్డ్ లవర్స్కి అప్డేట్!
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్పై ₹160 పెరిగి ₹1,56,930కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై ₹150 పెరిగి ₹1,43,850 వద్ద, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹1,17,730 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే బంగారం కొనేముందు ఈ రేట్స్ని మార్కెట్లో ఒకసారి మళ్లీ చెక్ చేసుకోండి.

హైదరాబాద్కు 3 కొత్త లోగోలు.. సిటీకి కొత్త ఐడెంటిటీ!
TG: హైదరాబాద్ సిటీ అడ్మినిస్ట్రేషన్లో కీలక మార్పుకు మరో విజిబుల్ మార్క్ వచ్చింది. CM రేవంత్రెడ్డి GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కొత్త లోగోలను లాంచ్ చేశారు. నిన్న మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభానికి ముందు ఈ లోగోలను రిలీజ్ చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత GHMCకి కొత్త లోగో వచ్చింది. CMC లోగో కేర్, సస్టైనబిలిటీ, గ్రోత్ను, MMC లోగో ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ప్రజా సేవను రిప్రజెంట్ చేసేలా ఈ లోగోలను డిజైన్ చేశారు.

శ్రీనివాస్రెడ్డికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే
TG: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన శ్రీనివాస్రెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్రెడ్డి పరిస్థితిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వయంగా రూ.3 లక్షల చెక్కును బాధితుడికి అందజేశారు.

కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పోరుబాట: ధర్మారెడ్డి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న ప్రభుత్వ హామీలు, వైఫల్యాలను వివరిస్తూ ఛార్జ్షీట్ విడుదల చేస్తామని చెప్పారు. 3న రైతు సదస్సులు, 5న యువత ర్యాలీలు, 6న సింగరేణి మైన్స్ వద్ద నిరసనలు నిర్వహిస్తామని వెల్లడించారు.

మహాధర్నాకు బయలుదేరిన ఉద్యోగులు
TG: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పీఆర్టీయూ నాయకులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా జరగనుంది. నర్సంపేట నుంచి పీఆర్టీయూ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ఆందోళనలో పాల్గొననున్నారు.

చేపల వేట విషాదం.. మత్స్యకారుడు మృతి
AP: శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీ గడ్డ ఊరు సముద్ర తీరంలో చేపల వేట విషాదంగా మారింది. మంగళవారం చేపల వేటకు వెళ్లిన వంక యాదవరావు (55) ప్రయాణిస్తున్న తెప్ప ఒక్కసారిగా బోల్తా పడటంతో సముద్రంలో మునిగి మృతి చెందారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మత్స్యకారులు కూడా సముద్రంలో పడిపోగా సురక్షితంగా బయటపడ్డారు. అయితే యాదవరావు తెప్ప కింద చిక్కుకోవడంతో స్థానికులు తీవ్రంగా శ్రమించి ఆయనను ఒడ్డుకు తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కూతుళ్ల చదువు కోసం.. అమ్మ మారథాన్లో గెలిచింది!
మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని అంబాజోగైకి చెందిన రమాబాయి రణ్వీర్ (47) మారథాన్లో సత్తా చాటారు. చీరలో, ముందుగా చెప్పులతో రేసులో పాల్గొన్న ఆమె.. చెప్పులు జారిపోవడంతో చేతిలో పట్టుకుని బేర్ఫుట్గా పరుగెత్తారు. స్పోర్ట్స్ షూస్తో బరిలోకి దిగిన యూత్ను క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్ సాధించారు. ‘అమృత్ దౌడ్’లో గెలిచిన ఆమె రూ. 3వేల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ కూడా గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని తన ఇద్దరు కూతుళ్ళ చదువులకు ఖర్చు చేయనున్నారు. ఆర్థిక కష్టాలున్నా పిల్లలకు మంచి చదువు చెప్పాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

దాచేపల్లిలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి కీలక నేత
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ 20వ వార్డులో టీడీపీ నాయకుడు ముశ్యాం శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. కాసు మహేష్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.

కెరీర్ కోసమే మెన్ ఫ్రెండ్షిప్స్?!
European, US అకాడెమిక్స్ నిర్వహించిన 'సోషల్ నెట్వర్క్స్' జర్నల్ స్టడీ ప్రకారం ఆఫీసుల్లో మెన్, విమెన్ ఫ్రెండ్షిప్స్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. విమెన్ తమ కొలీగ్స్ ఫ్రెండ్స్తో కూడా ఈజీగా కనెక్ట్ అవుతూ డీప్ రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటారు. కానీ మెన్ మాత్రం కెరీర్ గ్రోత్కి హెల్ప్ అయ్యే సెలెక్టివ్ వన్-టు-వన్ ఫ్రెండ్షిప్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. ఆఫీసులో మంచి ఫ్రెండ్స్ ఉన్న ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా, ప్రొడక్టివ్గా ఉంటారని, వాళ్లు జాబ్ మారే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుందని ఈ రీసెర్చ్ చెప్తోంది.

వరంగల్ కమిషనరేట్లో 22 మంది సీఐల బదిలీలు
TG: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 మంది సీఐలకు బదిలీలు, కొత్త పోస్టింగ్లు కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాతో పాటు కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలకు అధికారులను కేటాయించారు. ఎస్. శ్రీనివాస్ను స్టేషన్ఘన్పూర్, జి. వేణును రఘునాథపల్లి, పి. దేవేందర్ను నర్మెట్ట, భరత్ సుమన్ను పాలకుర్తి, ఎ. ప్రవీణ్కుమార్ను పరకాల, అనుముల శ్రీనివాస్ను ధర్మసాగర్, జి. బాబులాల్ను ఆత్మకూర్, ఆర్. సంతోష్ను పర్వతగిరి, కె. శ్రీనును ఎల్కతుర్తి సీఐలుగా నియమించారు.

మహిళలు గడప దాటితే వినాశనమా?!
కేరళం ఇస్లామిక్ మతపెద్ద అబూబకర్ ముస్లియార్ మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని, వారు గడప దాటి బహిరంగ వేదికలు ఎక్కితే మహా వినాశనానికి దారితీస్తుందని కొచ్చి సదస్సులో అన్నారు. ఖురాన్ కూడా ఇదే చెబుతోందని, అందుకే ఇస్లాంలో పరదా సంస్కృతి ఉందంటూ సమస్త కేరళ జమియ్యతుల్ ఉలామా జనరల్ సెక్రటరీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్పై కేరళం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ, CPM లీడర్ పీకే శ్రీమతి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆ చీకటి రోజులు పోయాయని కౌంటర్ ఇచ్చారు.
గురజాలలో పత్తి పంటలకు నీటి కష్టం
AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వర్షాలు లేక, భూగర్భ జలాలు అడుగంటడంతో పత్తి పంటలు ఎండిపోతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు చేతికందే పరిస్థితి లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షపాత లోటుతో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని రైతులు వాపోతున్నారు. పత్తి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి నాగార్జునసాగర్ నుంచి కొంతమేర సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పల్లె నిద్రతో గ్రామ సమస్యలపై దృష్టి : SP
AP: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న “మెగా పల్లెనిద్ర” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి కళింగపట్నం గ్రామాన్ని సందర్శించారు. సోమవారం రాత్రి గ్రామస్థులతో సమావేశమైన ఎస్పీ సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

తుక్కుగూడలో నర్సు హత్య.. నిందితుడు అరెస్ట్
TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నర్సు హత్య కేసును పోలీసులు ఛేదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ, ఆస్పత్రి సమీపంలోని క్వార్టర్స్లో నివసిస్తోంది. లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు దాడి చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన బిహార్కు చెందిన మహ్మద్ సనావుల్లా ఖాన్ను అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు.

ఓటర్ల జాబితాలో తప్పులుంటే వెంటనే చెప్పండి
AP: పల్నాడు జిల్లా గురజాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తహసీల్దార్ కుటుంబరావు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించి బూత్ లెవెల్ అధికారులకు సహకరించాలని కోరారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు, అవసరమైన పత్రాలను పరిశీలిస్తున్నందున ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. జాబితాలో పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించుకుని తప్పులు ఉంటే వెంటనే బీఎల్వోలకు తెలియజేయాలని తెలిపారు.

22 మంది మహిళల జీవితాలు మార్చిన RDT!
అనంతపూర్ RDT ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న ఆటో డ్రైవింగ్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 22 మంది మహిళలు విజయవంతంగా డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సొంతంగా ఆటోలు అందుకున్నారు. ఇప్పటివరకు 45 మంది సింగిల్ మదర్స్ కి ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ ఇచ్చి వాళ్లలో కాన్ఫిడెన్స్ పెంచింది. మహిళలకు డ్రైవింగ్ తో పాటు సెల్ఫ్ డిఫెన్స్, రోడ్ సేఫ్టీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, కౌన్సెలింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకి Financial Independence, కొత్త లైవ్లీహుడ్ అవకాశాలు కల్పించారు.

పోలీస్, విద్యుత్, పెన్షన్ సమస్యలపై ఫిర్యాదులు
TG: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు అందాయి. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి మొత్తం నాలుగు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. పోలీస్, విద్యుత్, పెన్షన్ తదితర సమస్యలకు సంబంధించి ఒక్కో దరఖాస్తు అందినట్లు పేర్కొన్నారు.
మోదీ మరో Insta వీడియో, ఏం చెప్పారంటే..
భారత ఆర్థిక వ్యవస్థ 7.8% GDP గ్రోత్ సాధించడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సప్లై చైన్ సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ఈ స్థాయిలో ప్రగతి సాధించడం మన కాన్ఫిడెన్స్కి నిదర్శనమని అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా', 'వోకల్ ఫర్ లోకల్' కాన్సెప్ట్లను ఫాలో అవుతూ స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనవసర విదేశీ టూర్లు, బంగారం కొనుగోళ్లు తగ్గించి, 140 కోట్ల మంది ఐక్యతతో దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.