Latest

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడుతున్నారా ?
మన దేశంలో యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువగా వాడేస్తున్నారు. అయితే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో యాంటీబయాటిక్స్ కొనొద్దని పరిశోధకులు చెప్తున్నారు. ‘ది ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ సర్వే’లో ఈ విషయం వెల్లడిస్తూ డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని, దీంతో బాక్టీరియా తన రూపాన్ని మార్చుకుని 'యాంటీబయోటిక్ రెసిస్టెన్స్' అనే ప్రమాదం తీసుకొస్తుందని హెచ్చరించారు.

తల లేకున్నా కాక్రోచ్ బతకగలదు
కాక్రోచ్(బొద్దింక) ఎలాంటి కఠిన పరిస్థితులనైనా తట్టుకోగలవు. తల తెగినా ఇవి వారం రోజులు జీవించగలవు. కాక్రోచ్ నర్వ్ సిస్టం శరీరం అంతటా విస్తరించి ఉండటమే దీనికి కారణం. అందువల్ల బ్రెయిన్ సిగ్నల్స్ లేకపోయినా ఇవి కదలగలవు. వీటి రక్తం ప్రెజర్తో ప్రవహించదు. తల తెగినా ఎక్కువ రక్తస్రావం కాదు. శ్వాస తీసుకోవడానికి నోరు, ముక్కు కాకుండా శరీరంపై ఉండే చిన్న రంధ్రాలను ఉపయోగిస్తాయి. అయితే నోరు లేకపోవడం వల్ల తిండి, నీరు లేక చివరకు డీహైడ్రేషన్తో చనిపోతాయి.

రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారం అందించాలి
AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిశారు. పంటల సాగులో రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారమందించాలని అచ్చెన్నాయుడు కోరారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.

సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం
సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర 14 రోజులుగా వైరల్ న్యూమోనియాతో బాధపడుతూ కన్నుమూశారు. విజయవాడలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకొని సంతోషంగా ఉన్న అక్క ఇంతలోనే దేవుడి వద్దకు వెళ్ళిపోవడం తీరని లోటని మెహర్ రమేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

వాంగ్చుక్కు విదేశాల్లో పెరిగిన మద్దతు
ఎడ్యుకేషన్ సిస్టంలో లోపాలపై పోరాడుతూ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్కు అమెరికాలో మద్దతు పెరుగుతోంది. న్యూయార్క్, శాన్జోస్ నగరాల్లో ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’ సభ్యులు ఆయనకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లండన్, డబ్లిన్లలోని భారత కార్యాలయాల వద్ద కూడా నిరసనలు జరిగినట్లు సంస్థ ప్రకటించింది.
మద్యం మత్తులో కత్తితో హల్చల్
కర్ణాటకలోని మూడబిద్రి బస్టాండ్ దగ్గర మద్యం మత్తులో ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. మొబైల్ షాప్లోకి వెళ్లి షాప్ యజమానిని బెదిరిస్తూ మొబైల్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కత్తితో షాప్ ముందున్న స్తంభాలను కూడా కొట్టాడు. ఈ ఘటన అక్కడి CCTVలో రికార్డ్ అయింది. స్థానికులు యువకుడిని చుట్టుముట్టి కత్తిని లాక్కొని పట్టుకున్నారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

రాహుల్ గాంధీపై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు
రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ విద్యార్థులను వాడుకుంటున్నారని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని అన్నారు. పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసినా, కాంగ్రెస్ ఇలా రాజకీయ ప్రదర్శన చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన
దిల్లీలోని పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి బట్టలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదంటూ నినాదాలు చేశారు.

గిగ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కవిత
TG: గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది రోజంతా కష్టపడినా కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రావడం లేదన్నారు. మూడేళ్లుగా రేట్లు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. అగ్రిగేటర్ సంస్థలు అధిక కమీషన్లు, కోత విధిస్తూ డ్రైవర్లను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

48 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు
AP: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాలగూడెం గ్రామానికి 48 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు వచ్చింది. గ్రామస్థులు విద్య, వైద్య అవసరాల కోసం 8 కిలోమీటర్ల నడిచి వెళ్లి బస్కెక్కేవారు. ప్రజల కష్టాలను గమనించిన ప్రజాప్రతినిధులు ఊరికి బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామస్థులు సంతోషంతో బస్సుకు పూజలు చేశారు.

యురేనస్, నెప్ట్యూన్లపై డైమండ్ల వర్షం
మన దగ్గర వాన వస్తే నీటి చుక్కలు పడతాయి. కానీ యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై మాత్రం వజ్రాల వర్షం కురుస్తుంది. ఈ గ్రహాలు రాళ్లతో కాకుండా మీథేన్, నీరు, అమోనియా వంటి మంచు రూపాలతో నిండి ఉంటాయి. గ్రహం లోపలికి వెళ్లేకొద్దీ ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఆ ప్రెజర్కి మీథేన్లోని కార్బన్ విడిపోయి చిన్న డైమండ్లలా మారుతుంది. అక్కడి గాలి వేగం, తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడం స్పేసిషిప్స్కి సాధ్యం కాకపోవడం వల్ల ఆ వజ్రాలను సేకరించడం కుదరదు.

కొడంగల్లో సీఎం రేవంత్ ర్యాలీ
TG: నిన్న దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అరెస్ట్ను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ అంబేడ్కర్ చౌరస్తాలో ర్యాలీ చేశారు. నిందితులకు శిక్ష వేయాల్సిందిపోయి విద్యార్థులపై లాఠీలతో దాడి చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసుల దెబ్బలకు రాహుల్కు రక్తాలొచ్చాయని ఆగ్రహించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు.

జననాయగన్' సినిమా లీక్పై డైరెక్టర్ వినోద్ స్పందన
విజయ్ నటించిన ‘జననాయగన్’ లీక్పై డైరెక్టర్ హెచ్.వినోద్ స్పందించారు. సినిమాను లీక్ చేశారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఎన్నికల లాభం కోసం బిగ్ బడ్జెట్ సినిమాని ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. ఈ వివాదంపై నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆలస్యం కావడం వల్ల ఆరు నెలలు ఎంతో కష్టంగా గడిచాయని వినోద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జులై 23న సినిమా విడుదల కానుంది.
హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ను సందర్శించిన సీఎం రేవంత్
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సమీక్షించారు. విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ప్రణాళికలను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్కు సంబందించిన హాస్టల్స్ నిర్మాణ పనులను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు.

ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
TG : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో నైట్ డ్యూటీకి క్యాబ్ లో వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ ఉద్యోగినిని ఎవరూ లేని చోటికి తీసుకెళ్లి క్యాబ్ డ్రైవర్, ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె ధైర్యంతో అతడిపై ఎదురుతిరిగింది , ఎక్కడ దొరుకుతాననే భయంతో డ్రైవర్ తన కారుతో పారిపోయాడు. బాధితురాలు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్టు పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కరోనా కలకలం.. సీలేరు పర్యాటకుల ప్రవేశం నిలిపివేత
APలో కరోనా కేసులు పెరుగుతుండటంతో విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలోకి పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లకు బయటి వ్యక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రజలు కూడా మాస్క్లు ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: పొన్నం
TG: నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇతర ముఖ్య నేతల అరెస్ట్కు నిరసనగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన మహాధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం అని, ఢిల్లీలో హింసపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.

ఏపీలో మళ్లీ కరోనా టెన్షన్..!
AP: ఏపీలో Omicron RF.5 వేరియంట్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 7 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కి చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వైరస్ 10 జిల్లాలకు విస్తరించింది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ సూచించింది.

CJP ధర్నాలో నిరసనకారుల ఇబ్బందులకు ఇదిగో సాక్ష్యం
దిల్లీ నగరంలోని జంతర్మంతర్ వద్ద మొన్న జరిగిన ‘చలో సంసద్’ ర్యాలీ మీద పోలీసులు జరిగిన లాఠీచార్జ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మద్దతుదారులను ముందుకు సాగనీయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వారిపై తమ ప్రతాపం చూపించారు. లాఠీలు, టియర్ గ్యాస్తో విరుచుకుపడ్డారు. జనాన్ని చెల్లాచెదురు చేశారు. ఆ క్రమంలో ఎంతోమంది చెప్పులు వదిలేసి పరిగెత్తారు. ఆ దాష్టీకానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఈ చిత్రం.
ఆర్టీసీ బస్సునే దొంగలించిన దుండగుడు
TG: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ నుంచి ఓ దుండగుడు ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. బస్సును వేగంగా నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొట్టడంతో పోలీసులు సినిమా రేంజ్ లో బస్సును ఛేజ్ చేశారు. చివరకు జిల్లా సరిహద్దు వద్ద అడ్డుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తల్లికి వందనం నిధులు రూ.10,120.78 కోట్లు విడుదల : నారా లోకేష్
AP: 'ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకుగానూ, 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నాం, ఈనెల 24 వరకు నిధుల విడుదుల కొనసాగుతుంది' అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పిల్లల చదువులే రాష్ట్రానికి నిజమైన ఆస్తి అని, ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా ఈ సాయం అందించేలా 'తల్లికి వందనం' పథకాన్ని రూపొందించామంటూ మంత్రి లోకేష్ 'X' లో తెలిపారు.