← Back to news

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: పొన్నం

By DK· 22 Jul 2026· కరీంనగర్ జిల్లా

TG: నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇతర ముఖ్య నేతల అరెస్ట్‌కు నిరసనగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన మహాధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం అని, ఢిల్లీలో హింసపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. నీట్ పేపర్ లీక్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.

More in Politics