← Back to news

CJP ధర్నాలో నిరసనకారుల ఇబ్బందులకు ఇదిగో సాక్ష్యం

By విశీ· 22 Jul 2026· దిల్లీ
CJP ధర్నాలో నిరసనకారుల ఇబ్బందులకు ఇదిగో సాక్ష్యం

దిల్లీ నగరంలోని జంతర్‌మంతర్ వద్ద మొన్న జరిగిన ‘చలో సంసద్’ ర్యాలీ మీద పోలీసులు జరిగిన లాఠీచార్జ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మద్దతుదారులను ముందుకు సాగనీయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వారిపై తమ ప్రతాపం చూపించారు. లాఠీలు, టియర్ గ్యాస్‌తో విరుచుకుపడ్డారు. జనాన్ని చెల్లాచెదురు చేశారు. ఆ క్రమంలో ఎంతోమంది చెప్పులు వదిలేసి పరిగెత్తారు. ఆ దాష్టీకానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఈ చిత్రం.

More in India