రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారం అందించాలి

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిశారు. పంటల సాగులో రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారమందించాలని అచ్చెన్నాయుడు కోరారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.



