శ్రీకాకుళం Redcrossకు గవర్నర్ గోల్డ్ మెడల్

శ్రీకాకుళం జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది. విజయవాడలో జరిగిన రెడ్క్రాస్ రాష్ట్ర శాఖ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ అవార్డును అందుకున్నారు. రక్తదాన శిబిరాలు, ఆపదల్లో సహాయం చేయడంలో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని రాజాం పట్టణానికి చెందిన చైతన్య కుమార్ అన్నారు.



