← Back to news

గ్రామాల్లో దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన

By Md Jabeer· 19 Aug 2026· నిర్మల్ జిల్లా
గ్రామాల్లో దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన

TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూర్చేలా క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోంది. నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలంలోని అలురు, బోరేగావ్‌, సాయినగర్‌ తండా గ్రామాల్లో గెజిటెడ్‌ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించారు. హెచ్‌వో మౌనిక గ్రామాల్లో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలురు గ్రామానికి చెందిన కుమ్మరి చంద్రకళ పరమేష్‌ తదితరుల దరఖాస్తులను తనిఖీ చేశారు.

More in Local