← Back to news

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరించొద్దు: AISF

By Shirisha Chinthakindi· 18 Aug 2026· రంగారెడ్డి జిల్లా
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరించొద్దు: AISF

TG: జీవో నంబర్‌ 97ను వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ఫరూక్‌నగర్ తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కొత్త పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు.

More in Local