← Back to news

రద్దయిన NLSIU కాన్వగేషన్ వేడుక

By .· 28 Aug 2026· Bengaluru East, Bengaluru Urban
రద్దయిన NLSIU కాన్వగేషన్ వేడుక

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ(NLSIU) సెప్టెంబర్ 12న జరగాల్సిన 34వ కాన్వగేషన్ వేడుకను రద్దు చేసింది. CJI సూర్య కాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) చైర్మన్‌ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడాన్ని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. యాజమాన్యం, విద్యార్థి సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రిజిస్ట్రార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను కొరియర్ ద్వారా లేదా నేరుగా క్యాంపస్ లో ‘ఇన్ అబ్సెంటియా’ (In-absentia) పద్ధతిలో అందజేయనున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 2h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.