రాజాంలో గణేశ్ ఉత్సవాలకు డీజేలకు క్లియర్ నో.. పర్మిషన్ లేదు!

విజయనగరం జిల్లా రాజాం మండలంలో వచ్చే గణపతి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని సీఐ నవీన్ కుమార్ హెచ్చరించారు. శబ్ద కాలుష్యం కారణంగా ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని, ఏ డీజే అయినా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్వాహకులు కట్టుదిట్టమైన నియమాలు పాటించాలని ఆదేశించారు.



