క్లాస్రూమ్ లేదు.. రేకుల షెడ్లో విద్యాభ్యాసం

TG: వనపర్తి జిల్లా పెబ్బేరులోని చెంచువాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రీప్రైమరీ నుంచి ఐదోతరగతి వరకు 136 మంది విద్యార్థులు ఉండగా, కేవలం రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. స్థానికులు, దాతల సహకారంతో రేకుల షెడ్లు ఏర్పాటుచేసి తరగతులు నిర్వహిస్తున్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు బ్లాక్బోర్డులు లేకుండానే పాఠాలు బోధిస్తున్నారు. ఎండ, వర్షాల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వర్షం కురిస్తే తరగతులు నిర్వహించలేకపోతున్నారు.



