← Back to news

జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే-జడ్పీటీసీ వాగ్వాదం

By CHANDU· 1d ago· Palasa, Palasa, Srikakulam

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థాయి సంఘ సమావేశం తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, పోలాకి జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య మధ్య అభివృద్ధి పనులు, పింఛన్లపై ఆరోపణలు, సవాళ్లు వచ్చాయి. నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రవికుమార్ పేర్కొనగా, ముందుగా ఎంపీటీసీగా గెలిచి చూపించాలని కృష్ణచైతన్య సవాల్ విసిరారు. ఇరువర్గాల మధ్య వాడివేడి వాదనలు, నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు, ఇతర సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.