గొల్లప్రోలు ఎన్నికలకు రెడీ.. 23 వార్డుల పరిశీలన!

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 20 నుంచి 23కు పెరుగుతున్నాయ్. గెజిట్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్కంలో కమిషనర్ దివిజ సంపతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కొత్త కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బీవీఎస్ ప్రసాద్, కార్యాలయ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



