మంటల్లో ఏసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్ లో ఘోర బస్సు ప్రమాదం నుంచి 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్ కి చెందిన ఏసీ బస్సు KPHB దగ్గర మంటల్లో చిక్కుకుంది. మియాపూర్ నుంచి పాలకొల్లు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సిబ్బంది వెంటనే స్పందించి అందులో ఉన్న 18 మంది ప్రయాణికుల్ని దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.



