హిందూపురంలో జనసేన భారీ బైక్ ర్యాలీ!

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జనసేన సందడి చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి చౌడేశ్వరీ కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రోడ్లన్నీ జెండాలతో నిండిపోయాయి. ఫంక్షన్ హాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్ఈడీ తెరపై పవన్ ప్రసంగాన్ని శ్రేణులు ఆసక్తిగా వీక్షించారు.




