← Back to news

గుడుంబా డంప్‌పై పోలీసుల రెయిడ్.. 2,000 లీటర్ల పానకం ధ్వంసం!

By Srikanth· 1d ago· Manthani, Manthani, Peddapalli
గుడుంబా డంప్‌పై పోలీసుల రెయిడ్.. 2,000 లీటర్ల పానకం ధ్వంసం!

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 2,000 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. సీఐ బుద్దె స్వామి ఆధ్వర్యంలో గురువారం జరిగిన దాడిలో ప్లాస్టిక్ క్యాన్లు, డ్రమ్ముల్లో నిల్వ చేసిన పానకాన్ని స్వాధీనం చేసుకుని పంచుల సమక్షంలో అక్కడికక్కడే ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణ నాయక్, రమేష్ రావు, కానిస్టేబుళ్లు శివ, అజిత్, సతీష్, అంజి పాల్గొన్నారు.

గుడుంబా డంప్‌పై పోలీసుల రెయిడ్.. 2,000 లీటర్ల పానకం ధ్వంసం!
గుడుంబా డంప్‌పై పోలీసుల రెయిడ్.. 2,000 లీటర్ల పానకం ధ్వంసం!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 40m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.