← Back to news

చింతూరు ఏజెన్సీలో హైఅలర్ట్

By DK· 31 Jul 2026· పోలవరం జిల్లా
చింతూరు ఏజెన్సీలో హైఅలర్ట్

AP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా చేరడంతో నదీ ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. శబరికి అనుసంధానమైన కుయుగూరు, చీకటి, సోకిలేరు, చంద్రవంక వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నది పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా నదులు, వాగుల వద్దకు వెళ్లొద్దని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

More in AP