రోడ్డు పక్కన పానీపూరీ తింటున్నారా?
TG : హైదరాబాద్లోని అత్తాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఫుడ్ సెంటర్ లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితుల్లో భారీగా పానీపూరీలు, సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని నగరంలోని వివిధ రోడ్డు పక్కన ఉండే బండ్లకు సరఫరా చేస్తున్న ఈ అక్రమ తయారీ పై అధికారులు, కఠిన చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన దొరికే ఆహారం పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.



