చెన్నారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నలుగురు అరెస్ట్

AP: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో జరిగిన నవులూరి చెన్నారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన స్కార్పియోతోపాటు మూడు గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ ఆధిపత్యం విషయంలో ఉన్న విభేదాల నేపథ్యంలో చెన్నారెడ్డిని ప్లాన్ ప్రకారం కారుతో ఢీకొట్టి, కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు వాహనంలో పరారవుతుండగా దాచేపల్లి–మాచర్ల క్రాస్రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.



