← Back to news

ఆదివాసీలకు 100% రిజర్వేషన్‌పై అసెంబ్లీలో బిల్లు పెట్టాలి

By BALADEV PODDU· 18 Aug 2026
ఆదివాసీలకు 100% రిజర్వేషన్‌పై అసెంబ్లీలో బిల్లు పెట్టాలి

AP: ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యామ్నాయ జీవో జారీ చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. డంబ్రిగుడ మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. బాలదేవ్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, చట్టాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మహోద్యమం చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

More in Local