← Back to news

స్టైఫండ్‌ కోసం రోడ్డెక్కిన డాక్టర్లు.. గుంటూరులో ర్యాలీ

By ORSU KRISHNA· 19 Aug 2026· Guntur (R), Guntur West, Guntur

AP: స్టైఫండ్‌ పెంపు కోసం గుంటూరు జీజీహెచ్‌ జూనియర్‌ డాక్టర్లు రోడ్డెక్కారు. స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. రమేష్‌ హాస్పిటల్‌ సిగ్నల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య సేవల్లో ఎదురవుతున్న పని ఒత్తిడి, విధుల భారం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా స్టైఫండ్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

More in Local