సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను పాటించాల్సిందే: కేంద్రం

దేశంలో పనిచేసే ఏ సోషల్ మీడియా సంస్థ అయినా దేశంలో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’కు కేంద్రం స్పష్టమైన సందేశం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఏ అకౌంట్ను అయినా తొలగించాలని ఆదేశిస్తే.. ఆ ఆదేశం యూజర్స్కు కనిపించేలా, అందరికీ తెలిసేలా ‘ఎక్స్’ ఇటీవల కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై కేంద్రం స్పందించింది.


