చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్కు?

ఏడేళ్ల తర్వాత షీ జిన్పింగ్ మళ్లీ భారత్కు వస్తారా? సెప్టెంబర్ 12–13న ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన వచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు ఆసక్తి పెంచుతున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మేషన్ లేదు. కానీ ఇదే టైమ్లో అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సరిహద్దు సమస్యపై చర్చలు జరుపుతున్నారు. 2020 తర్వాత కాస్త దూరమైన భారత్–చైనా సంబంధాలు ఇప్పుడు మళ్లీ కదులుతున్నాయి. ఒకవేళ షీ వస్తే.. సరిహద్దుపై ఏదైనా కొత్త నిర్ణయం వస్తుందా? అదే ఇప్పుడు అందరి చూపు.



