పాలిటెక్నిక్లను అనుసంధానం చేయొద్దని MLAకు వినతి

TG: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య అందిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థను పటిష్టం చేయాల్సింది పోయి పీపీపీ విధానం తీసుకురావడం ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.




