గుంతలమయంగా నేషనల్ హైవే

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని జాతీయ రహదారి-30 అధ్వానంగా మారింది. రహదారిపై ఏర్పడిన భారీ గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గం నిత్యం రద్దీగా ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి దుస్థితిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేపట్టి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుంతల కారణంగా ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు.




