రాజాంలో కిరాణా షాపుల యజమానుల కొట్లాట
AP: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని GMR కేర్ సెంటర్ సమీపంలో ఉన్న మద్యం దుకాణం ఎదురుగా రెండు కిరాణా దుకాణాల యజమానులు పరస్పరం గొడవపడి దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రోడ్డుపై కొట్లాటకు దిగడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.



