వైర్ పడిందన్న భయంతో పరుగులు.. ఆలయంలో విషాదం!

బిహార్లోని లఖిసరాయ్ జిల్లా అశోక్ధామ్ ఆలయంలో ఈరోజు ఉదయం తీవ్ర విషాదం జరిగింది. శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో భారీగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 6.45 గం. సమయంలో ఎలక్ట్రిక్ వైర్ పడిందన్న భయంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాట ఘటనకు ఖచ్చితమైన కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



