కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్రను అడ్డుకోవాలి: సండ్ర

TG: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు అండగా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల అమలుపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.



